ప్రకృతి సవాల్...
డా. రామకృష్ణ మున్నలూరి
సహాయ శాస్త్రవేత్త.. తె
లంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి
విశ్వాధినేతలం మేమంటే మేమని.. అఖండ శక్తి సంపన్నులము మేమంటే మేమని... సకల జగానికి దిక్సూచి మేమంటే మేమని..ఈ సమస్త చరాచర జీవులు నా కను సన్నల్లో.. అధుపాగ్నల్లో మెలగాలని...ఈ నేల నాది..ఆ కడలి నాది... పైనున్న నింగి నాది..ఆ పై ఉన్న అంతరిక్షం కూడా నాదే నాదే అంటూ... విశృంఖలంగా ప్రకృతి వనరులను ఒడిసి ఒడిసి పడుతూ... భావివ తారల పాటి.. గ్రహపాటు గా మారి... వారితో నాకేం పని అ న్నటూ..రేపు అన్నది ఒకటి లేదన్నట్టు...విశ్వం అనే రాజ్యం లొ అశ్వమేధ యాగమొనర్చి.. అప్రకటిత చక్రవర్తిగా విర్రవీగిన మనిషి... ఎందుకో నేడు డీలా పడ్డాడు... ఒక సూక్ష్మ జీవి మరణ శంఖం పూరిస్తూ... విలయ తాండవం చేస్తూంటే..అతని సార్వభౌమత్వాన్ని వెక్కిరిస్తూ...వికట్టః హసం చేస్తూంటే.. విస్తు పోయాడు.. గమ్మునుండి పోయాడు... ప్రకృతిని మించిపోయానన్న బ్రమ ఒక్కసారిగా తొలగిపోయింది... మేరు శిఖరమంత అహం పటాపంచలైంది.. ఇప్పుడు మెలుకున్నాడు ..కాస్త స్థిమిత పడ్డాడు...చరిత్ర తెలిసిన అతనికి ఇది అంతం కాదని తెలుసు..ఆ సూక్ష్మ జీవి వ్యాప్తి గుట్టు రాబట్టాడు... మందు కాస్త ఆలస్యం కావచ్చు ..అందాక ఏమిటని శోదించాడు.. కరోనా కి తనలాగే అహం కాస్త ఎక్కువని... దాని దగ్గర కి వెళ్తేనే అది సోకుతుందని ..ఇంటి పట్టునుంటే మన జోలికి రాదని కనిపెట్టాడు... స్వీయ నియంత్రణ ప్రస్తుతానికి శరణ్యమని... భౌతిక దూరం పాటిస్తూ..చేతులు తరచూ శుభ్ర పరుస్తూ.. మొహాన్ని.. ముక్కును..పరి పరి తడుమకుంటే చాలు... కరోనా మనకు ఆమడ దూరమని... గ్రహించాడు..చాటింపు వేయించాడు...ఇప్పుడు అందరికీ బోధపడింది.. జ్ఞానోదయమైంది... ఇప్పుడంతా ఇంటి పట్టునే ఉంటూ...ఆత్మీయులతో అనుబంధ గీతికలు అల్లుతూ... చిన్ననాటి జ్ఞాపకాలు..పెళ్లి నాటి ముచ్చట్లతో స్వాంతన చెందుతూ..పిల్లలతో పోటీ పడి అల్లరి చేస్తూ... వదిలేసిన కుంచె ను పట్టి రమ్యమైన భొమ్మలు వేస్తూ..గూడు లో బూజు పట్టిన పుస్తకాలు దుమ్ము దులిపి ఒక్కొక్కటిగా చదువుతూ...ఎక్కడో తెలియని భయం వెంటాడుతూనే ఉన్నా... ఇంక ఎన్నాళ్ళు ఇలా అని మది కలవర పెడ్తూఉన్నా ..గుండేకి ధైర్యం చెప్పుకొని...మనసంతా ఆశను నింపుకొని..ఈ భూమి పై కరోనా కి త్వరలో నూకలు చెల్లుతాయని వేచి చూస్తున్నాడు..అతని కోరిక త్వరలోనే తీరాలి...ఇప్పటికైనా మనిషి తీరు మారాలి...ప్రకృతి పై పెత్తనం మాని సహజీవనం చేయాలి..ఈ భూమి పై అందరూ చల్లగా ఉండాలి... లోక సమస్త సుఖినో భవంతు....
రచన: డా రామ కృష్ణ మున్నాలూరీ..
సహాయ శాస్త్రవేత్త..
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి...